సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు పోలంపల్లి వీరయ్య గురువారం తాడిచెట్టుపై నుంచిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఈ సందర్భంగా గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి మాట్లాడుతూ ప్రభుత్వం వీరయ్య కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.