జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

యాదాద్రి భువనగిరి జిల్లా: విధి నిర్వహణలో భాగంగా మీడియా కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసిన ఇటుక బట్టి యజమానులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.బుధవారం ఇటుక బట్టీలో పని చేసే ఓ ఒడిశా కార్మికుడు మృతి చెందింది ఘటనను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల పట్ల ఇటుక బట్టీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తూ,దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి బొమ్మలరామారం తహసిల్దార్ పద్మ సుందరికి మరియు ఎస్ఐకి మండల జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.

 Action Should Be Taken Against Those Who Attacked Journalists Bommalaramaram Det-TeluguStop.com
Telugu Latest, Sudheer, Suryapet, Telugudistricts-Suryapet

జర్నలిస్టుల నిరసనకు మండల ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ మైలారం జంగయ్య, సిపిఎం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం,పున్నమ్మ లక్ష్మయ్య,యాదయ్య తదితరులు మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఏల్లబోయిన శ్రీహరి,జూపల్లి బాలకృష్ణ, పోలగోని కరుణాకర్ గౌడ్, భూపాల్,ఈటబోయిన బాలకృష్ణ,గాదే బాలరాజ్, నిమ్మ వెంకట నరసింహారెడ్డి,ఇప్పలపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube