రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల శివారులోని ఎన్టీఆర్ కాలనీ వద్ద మిర్యాలగూడ కోదాడ ప్రధాని రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.నేరేడుచర్ల మండలం రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి సత్యనారాయణ(40)అతని కుమారుడు జశ్వంత్(13) మరియు కూతురు కావేరితో కలిసి మోటార్ సైకిల్ పై నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 Two Died On The Spot In A Road Accident-TeluguStop.com

ఈ ప్రమాదంలో సత్యనారాయణ అతని కుమారుడు జశ్వంత్ అక్కడికక్కడే మృతిచెందగా, కూతురు కావేరికి సీరియస్ గా ఉండటంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube