ఘనంగా రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:సర్వమత సమానత్వాన్ని బోధించి,ఆచరించి చూపిన శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం నేటి మానవులందరికీ ఆచరణీయమని సంస్కృత భారతి కార్యకర్త చింతకింది సద్గుణ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆశ్రమంలో శ్రీ రామకృష్ణ పరమహంస187వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

 Ramakrishna Paramahamsa Jayanti Celebrations Are In Full Swing-TeluguStop.com

ఈ సందర్భంగా ఆమె “భగవద్గీత శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం” అనే అంశంపై ఉపన్యసించారు.వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొన్నారు.

భజనలు,పారాయణాలు సద్గ్రంధ పఠనం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి జిల్లా కార్యదర్శి దొంగరి సోమయ్య,పెండెం చంద్రశేఖర్, స్వర్ణలత,కోనేటి వెంకన్న,శశికళ,నాగవల్లి ప్రభాకర్,మొరిశెట్టి రామ్మూర్తి,రాగి శ్రీనివాసాచారి, కొంపెల్లి శ్రీనివాసు,గుండాల లక్ష్మయ్య నాగవల్లి దశరథ,నామిరెడ్డి పాపిరెడ్డి,నామిరెడ్డి సత్తిరెడ్డి, భాస్కరాచారి,చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube