సూర్యాపేట జిల్లా:మంత్రి జగదీష్ రెడ్డి కృషితో తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా సూర్యాపేట మున్సిపాలిటీలోనే బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ తెలిపారు.బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ తో కలసి బయోగ్యాస్ కంపెనీ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట స్టేజి సమీపంలో ఈ కంపెనీ ఏర్పాటుకు మున్సిపాలిటీ స్థలం కేటాయించినట్లు చెప్పారు.
తడి చెత్తతో బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తారని,మున్సిపాలిటీకి ఆదాయంతో పాటి పరిశుభ్రత కూడా వస్తుందని అన్నారు.ఇక్కడ తయారయ్యే బయోగ్యాస్ వాహనదారులకు అమ్మకాలు చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బయోగ్యాస్ కంపెనీ ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.