సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం ఆధ్వర్యంలో చివ్వెంల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్ గురించి,సైబర్ నేరాలపై,మానవ అక్రమ రవాణా గురించి, మహిళలు మరియు పిల్లల భద్రత గురించి,పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం చేత షీ టీమ్స్,మహిళల భద్రత రక్షణ,మానవ అక్రమ రవాణా,లింగ వివక్షత, 100 డయల్,సోషల్ మీడియా,ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాలు,టోల్ ఫ్రీ నెంబర్ 1930,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల వంటి అంశాలపై ఆట, పాటల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అవగాహనకల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట షీ టీం ఏఎస్ఐ పాండు నాయక్,షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జాఫర్, హెడ్ కానిస్టేబుల్ యల్లారెడ్డి,కానిస్టేబుల్ శివరాం,పోలీస్ సిబ్బంది, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య,గోపయ్య,చారి, నాగార్జున,కృష్ణ , గురులింగం మరియు పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.