పెళ్ళైన 8 రోజులకే ఇంట్లో విషాదం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.పెళ్ళైన వారం రోజులకే నవ వరుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శోభనాద్రిగూడెంకు చెందిన పరికల శ్రీకాంత్ (23)అనే యువకుడికి తన సొంత మేనమామ కూతురితో ఫిబ్రవరి 20 న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.ఏమైనదో ఏమో కానీ,శ్రీకాంత్ సోమవారం ఇంటి నుండి బైక్ పై బయటకు వెళ్లి,తిరిగి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలీ తుదిశ్వాస విడిచాడు.

 Tragedy At Home Within 8 Days Of Marriage-పెళ్ళైన 8 రోజు�-TeluguStop.com

కండ్ల ముందే కన్న కొడుకు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు,ఇంకా కాళ్ల పారాణి ఆరక ముందే తన భర్త తనువు చాలించడంతో నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయి బోరున విలపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube