యాదాద్రిలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ...!

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన రాష్ట్ర ఆర్ధిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నిరు హరీష్ రావుకు స్థానిక దళితుల నుండి నిరసన సెగ తగిలింది.శంకుస్థాపన చేసిన వెళుతున్న మంత్రిని దళితులు అడ్డుకొని తమ భూములను గుంజుకొని ఆసుపత్రి కడుతుండ్రు బాగానే ఉంది.

 Protest Against Minister Harish Rao In Yadadri , Minister Harish Rao , Yadadri,-TeluguStop.com

కానీ,ఏ ఆధారం లేని మా బతుకుల సంగతి ఏంటని ప్రశ్నించారు.గత ప్రభుత్వం తమకు జాగాలు ఇస్తే మీకు ఓటేసి రెండుసార్లు అధికారం ఇచ్చినందుకు మా నెత్తిన మన్ను పోస్తారా అంటూ దళిత మహిళలు నిలదీశారు.

కనీసం వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయగా అది తీసుకొని కొద్దిసేపు ఆగి తమ అవేదన వినకుండా, ఎలాంటి భారోసా ఇవ్వకుండానే మంత్రి హరీష్ రావు అక్కడిని వెళ్ళిపోయారని బాధితులు వాపోయారు.తమ ప్రాణాలు పోయినా సరే ఈ భూములు వదులుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube