వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనక మిషన్ భగీరథ( Mission Bhagiratha ) వాటర్ పైపు పగిలి నీరు వృధాగా పోతుంది.గత కొన్ని రోజులు క్రితం ఇదే పైప్ లైన్ పగిలి నీరు పోతుండటంతో స్థానికులు సోషల్ మీడియా( Social media )లో పెట్టడంతో అధికారులు మరమ్మతులు చేశారు.

 Missing Mission Bhagiratha Water , Mission Bhagiratha , Mission Bhagiratha Wate-TeluguStop.com

కానీ,ఇప్పుడు అదే పైప్ లైన్ మళ్ళీ పగలడంతో గత వారం రోజులుగానీళ్ళు పాలవుతున్నాయి.

ఇప్పటికే వర్షాలు సకాలంలో రాక,సాగర్ నీటి విడుదల చేయక, సతమతమవుతున్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోర్లు, బావులు కూడా అడుగంటిన క్రమంలో పట్టణంలో పలు వార్డుల్లో మున్సిపల్ నల్లా నీళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు సక్రమంగా రాక ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై ప్రజలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి పైప్లైన్ మరమ్మత్తులు చేసి ప్రజలకు మిషన్ భగీరథ నీటిని అందించి,నీటి కష్టాలని తీర్చాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube