సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి ప్రాంతంలో మనిషి ముఖం ఆకారం కలిగిన ఓ వింత పక్షి ప్రత్యక్షమై హల్చల్ చేసింది.దీనిని చూసేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని దీనిని బార్న్ గుడ్లగూబ అంటారని,
ఇది ఎక్కువగా ఎడారి ప్రాంతాలు, ఆసియా,హిమాలయ,ఇండోనేషియాలో కొన్ని ద్వీపాలలో మాత్రమే కనిపిస్తుందని తెలిపారు.
ఈ వింత పక్షి అనారోగ్యం బారినపడి ఎగరలేకుండా ఉందని అక్కడి నుండి తరలించారు.