సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండ( Atmakur )ల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సూర్యాపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) చేతుల మీదుగా మండలంలోని 87 మంది లబ్ధిదారులకుకళ్యాణలక్ష్మీ,షాది ముబారక్( Kalyana Lakshmi ) చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆడపడుచులను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారన్నారు.
అంతే కాకుండా ఆ చెక్కులు కూడా ఆడపడుచుల పేరు మీద ఇవ్వడం చాలా సంతోషించదగ్గ పరిణామం అన్నారు.
ఈ నగదు ఆడపిల్లల పెళ్ళి ఖర్చులకు చేదోడుగా ఉపయోగ పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ హసీం,ఎమ్మార్వో వినోద్, ఆర్ఐ రమేష్,ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
.