సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెర్వు మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ,చక్రారెడ్డి మనుమరాలు శ్రీవహిణి ఇటీవల నిర్వహించిన కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది.ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో విధ్యార్ధినిని అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధ్యార్ధులు కృషితో,పట్టుదలతో ఉన్నతమైన విజయాలను సాధిస్తూ కన్న తల్లిదండ్రులకు,పుట్టి పెరిగిన గ్రామాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.