సూర్యాపేట జిల్లా:జిల్లాలో తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు ఈ నెల 16 నుండి 18 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ లో వజ్రోత్సవాలలో నిర్వహణలో భాగంగా 17-9-2022 న ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాదు నందు జరిగే బహిరంగ సభ,ముఖ్యమంత్రి సందేశం, ఆదివాసి గిరిజన సమ్మేళనం రండి తరలి రండి అనే పోస్టర్స్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో గల గిరిజన ప్రాంతాలలో అలాగే ముఖ్య కూడలల్లో గోడపత్రికలను గ్రామ పంచాయతీ సిబ్బందిచే అంటించాలని,అలాగే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా ప్రభావితం అయ్యేలా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.చేపట్టే కార్యక్రమాలలో జిల్లా అధికారులు సమర్థవంతంగా కలసి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పి.డి.కిరణ్ కుమార్,డిటీడబ్ల్యూఓ శంకర్,డిపిఆర్ఓ ఏ.రమేష్ కుమార్,హాబీబుద్ధిన్, డి.ఐ.ఈ మల్లేశం,ఏఓ శ్రీదేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.