ఆదివాసీ గిరిజన సమ్మేళనం వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ

సూర్యాపేట జిల్లా:జిల్లాలో తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలు ఈ నెల 16 నుండి 18 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ లో వజ్రోత్సవాలలో నిర్వహణలో భాగంగా 17-9-2022 న ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాదు నందు జరిగే బహిరంగ సభ,ముఖ్యమంత్రి సందేశం, ఆదివాసి గిరిజన సమ్మేళనం రండి తరలి రండి అనే పోస్టర్స్ ను ఆవిష్కరించారు.

 Inauguration Of Adivasi Tribal Association Wall Poster-TeluguStop.com

ఈ సందర్బంగా జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో గల గిరిజన ప్రాంతాలలో అలాగే ముఖ్య కూడలల్లో గోడపత్రికలను గ్రామ పంచాయతీ సిబ్బందిచే అంటించాలని,అలాగే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా ప్రభావితం అయ్యేలా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.చేపట్టే కార్యక్రమాలలో జిల్లా అధికారులు సమర్థవంతంగా కలసి పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పి.డి.కిరణ్ కుమార్,డిటీడబ్ల్యూఓ శంకర్,డిపిఆర్ఓ ఏ.రమేష్ కుమార్,హాబీబుద్ధిన్, డి.ఐ.ఈ మల్లేశం,ఏఓ శ్రీదేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube