కోదాడలో నిమజ్జన ఏర్పాట్లపై పెద్ద చెరువు ఘాటు పరిశీలించిన ఎస్పీ

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు ఘాటులో గణేష్ నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.శనివారం ఆయన కోదాడ పెద్ద చెరువు ఘాటును పరిశీలించారు.

 Sp Who Examined The Impact Of The Large Pond On The Immersion Arrangements In Ko-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని,చిన్న పిల్లలను దూరంగా ఉంచాలని,ఊరేగింపులో డీజేలు పెట్టరాదని,ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులకు సహకరించాలన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్న ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి,సిఐ రాము, పోలీస్,మున్సిపల్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube