సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు.ఆదివారం నూతనకల్మం డల కేంద్రంలో బంద్ పిలుపులో భాగంగా బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ( Congress party ) నూతనకల్ మండల నాయకులు అంజయ్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్( Gadari Kishore Kumar ) అనుచిత వ్యాఖ్యలపై ఆదివారం ఉమ్మడి నూతనకల్ మండల బంద్ కు అఖిలపక్షాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన నేపథ్యంలో తెల్లవారు జామున 4 గంటల నుండే అఖిలపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్ళి ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు అరెస్టులు చేసి,వారి ఫోన్లు స్విచ్చాఫ్ చేసి,ఎక్కడికి తీసుకెళ్ళారో సమాచారం లేకుండా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
శాంతియుతంగా నిరసన తెలియజేయాలని వస్తే అరెస్టు చేయడం ప్రశ్నించే గొంతుకలు నొక్కడమేనని, ఈ అరాచకాలను ప్రతిఒక్కరూ ఖండించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మహేశ్వరం చంద్రకళ, నాగం జయసుధ పిఎసిఎస్ వైస్ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.