కనుమరుగవుతున్న గ్రామీణ హరికథ,వీధి భాగవతాలు

సూర్యాపేట జిల్లా:ఒకనాడు గ్రామీణ ప్రాతాల్లో ఓ వెలుగు వెలిగిన బుర్రకథ,వీధి బాగోతాలు నేడు ఆదరణ కోల్పోయి కనుమరుగు అవుతున్నాయని కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త జలగం సుధీర్ అవేదన వ్యక్తం చేశారు.సోమవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ కెఎల్ఆర్ గేటెడ్ కమ్యూనిటిలో జరిగిన సామూహిక వనభోజనాల సంధర్భంగా అంతరించిపోతున్న బుర్రకథ,వీధి బాగోత కళను బతికిస్తున్న కొద్ది మంది కళాకారులను సన్మానించి గౌరవించారు.

 Disappearing Rural Greenery And Street Corners-TeluguStop.com

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 40 యెండ్ల కిందట వరకు గ్రామాల్లో బుడిగ జంగాల వర్గాలకు చెందిన కళాకారులు హరికథ,వీధి భాగవతాల కార్యక్రమాలు చేసి ప్రజలకు ఆనందం పంచేవారని గుర్తు చేశారు.ఈ సందర్భంగా అనంతగిరి మండలంలోని వెంకట్రామాపురం గ్రామానికి చెందిన రెవల్లి అచ్చయ్య ఆధ్వర్యంలో కళాకారులు శ్రీక్రిష్ణ-ఆర్జునుడు-సుభద్రలకు సంబందించి కొంతసేపు తమ కళను ప్రదర్శించారు.

ఈ కళాకారుల గురించి నేటి తరానికి వివరించటంతో చాలమంది వారితో ఫోటోలు దిగటానికి ఉత్సాహం చూపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube