CPI : రూ.500 లకే నేరుగా లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్ అందించాలి: సిపిఐ

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలెండర్( Gas Cylinder ) నేరుగా 500 రూపాయలకు లబ్ధిదారులకు అందించాలని సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.శనివారం సూర్యాపేట జిల్లా( Suryapet ) గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ముందు మొత్తం పైసలు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకొంటే ఆ తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పైసలు జమ చేస్తామనటం కరెక్ట్ కాదని,బ్యాంకులకు వెళ్లి పైసలు తీసుకోవాలన్నా పట్టణానికి వెళ్లక తప్పదని, పట్టాణానికి వెళ్ళితే ప్రభుత్వం ఇచ్చే పైసలు అక్కడనే అయిపోతాయని అన్నారు.

 Gas Cylinder To Be Provided Directly To Beneficiaries For Rs 500 Cpi-TeluguStop.com

తీసుకోవటం ఇవ్వటం కాకుండా మొదటనే ఐదు వందల రూపాయలు తీసుకొని గ్యాస్ సిలెండర్ ఇస్తే ఏ గందరగోళం ఉండదన్నారు.గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ( Subsidy Amount ) పైసలు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని చెప్పి రెండు మూడు నెలలు జమచేసి ఆ తర్వాత జమ చేయలేదని గుర్తు చేశారు.

మొత్తం పైసలు ముందు చెల్లించి గ్యాస్ సిలెండర్ తీసుకోవాలన్నా పేదలకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేరుగా లబ్ధిదారులకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube