సూర్యాపేట జిల్లా: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నాంది పలకాలని అనంతగిరి ఎమ్మార్వో అన్నారు.కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని త్రిపురవరం గ్రామంలోని హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడి కేంద్రాలను గురువారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధ్యాయులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి ఉన్నతమైన విద్యను బోధించాలన్నారు.
అంగన్వాడి కేంద్రాలలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మధ్యాహ్న భోజనం విషయంలో వంట సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాద్యాయులు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.