మేళ్లచెరువు మండల పరిధిలోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ( My Home Cement Factory )లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది.మై హోమ్ యాజమాన్యం అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ లో 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కిందపడిన ఘటనలో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందగా,పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని,వీరంతా ఉత్తరప్రదేశ్,బీహార్ రాష్ట్రాలకు చెందిన వారని సమాచారం.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
కానీ, ప్రమాదంపై మైహోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తూ,మీడియాను అనుమతించకుండా ఆంక్షలు విధించింది.గతంలోనే మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అక్రమ నిర్మాణాలు( Illegal Constructions ) జరుగుతున్నాయని మీడియా కోడై కూసినా తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
అప్పడే అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఇంత ప్రాణాలు కోల్పోయేవారు కాదని అంటున్నారు.