సూర్యాపేట జిల్లా:అనునిత్యం సమాజ శ్రేయస్సు కోసం, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడేది పోలీసులని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ అన్నారు.
గురువారం తెలంగాణ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కోదాడ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం వద్ద నిర్వహించిన పోలీస్ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.రక్తదాన శిబిరాఎన్ని ఏర్పాటు చేసిన కోదాడ పోలీసులను అభినందించారు.
ఈ సందర్భంగా వివిధ కళాశాలల విద్యార్థులు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి,సీఐలు, ఎస్ఐలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.