నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం

సూర్యాపేట జిల్లా:బీజేపీ కుట్రపూరితంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తూ టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా పలువురు టీఅర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఎంతో బలంగా ఉందని,బీజేపీ ఎన్ని కుట్రలు,కుతంత్రాలు పన్నినా టిఆర్ఎస్ ఎమీ చేయేదని,రాష్ట్ర ప్రజలు బీజేపీ చేస్తున్న నాటకాలు గమనిస్తున్నారని,సరైన సమయంలో సరైన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Latest Suryapet News