హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కృష్ణపట్టే ఏరియాలో పాలకవీడు మండలం గుండెబోయినగూడెం( Gundeboina Gudem ) అత్యంత మారుమూల ప్రాంతం.గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ గ్రామం అభివృద్ధికి ఆమడదూరం లో నిలిచింది.
ప్రస్తుతం ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక,ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ ప్రాంత వాసులు అవస్ధలు పడుతున్నారు.పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామం(ఆర్ అండ్ ఆర్ కాలనీ)కి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు 2023 అక్టోబర్ 7 న పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ రూ.1 కోటి 50 లక్షలతో అప్పటి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హడావుడిగా గుండ్లపహాడ్ నుండి గుండెబోయినగూడెం వరకు బిటి రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేశారు.కానీ,నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
ప్రస్తుత ఈ రోడ్డు మట్టితో కంకర తేలి ఐదు కిలోమీటర్ల దూరం పూర్తిగా ధ్వంసం కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy )పై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.