వైన్స్ సీజ్ చేసిన అధికారులు

నల్లగొండ జిల్లా:ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్న వైన్స్ షాపును ఎక్సైజ్ అధికారులు మంగళవారం సీజ్ చేశారు.ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని నూకల విద్యాసాగర్ రెడ్డి వైన్ షాపులో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈనెల 13న అధికారుల ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించారు.

 Officers Who Seized The Vines-TeluguStop.com

తనిఖీల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తేలడంతో కేసు నమోదు చేశారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చి వైన్స్ ను సీజ్ చేసినట్లు హాలియా ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపారు.గతంలో కూడా ఇదే విధంగా మద్యం అధిక ధరలకు విక్రయాలు జరిపినందుకు పెనాల్టీ విధించారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ రేఖ, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube