సూర్యాపేట జిల్లా: నిప్పు లేకుండా వండిన ఆహార పదార్థల్లో ఉండే పోషకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తమ పాఠశాలలో ఫైర్ లెస్ వంటకాల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ కార్తీక్ రాజా తెలిపారు.శనివారం న్యూ విజన్ పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతి విద్యార్థులచే వివిధ రకాల ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేయించారు.
ఆకలి సమస్య, ఇంధన శక్తిని పొదుపు చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఆహారాన్ని ఎలా వృధా చేస్తున్నారో తెలపడంతో పాటు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి పోషకా అహారం ప్రాధాన్యతను ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.