కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సంబురాలు...!

సూర్యాపేట జిల్లా:కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం పట్ల టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ( Ramesh reddy )ఆధ్వర్యంలో శనివారం బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచుకొని సంబురాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో రానున్న మార్పుకు నాంది అని అన్నారు.

 Congress Party's Comments On Karnataka Election Results...!-TeluguStop.com

కర్ణాటక ఎన్నికలలో గెలుపుకు పాటుపడ్డ సోనియా, మల్లికార్జున్ ఖర్గే,రాహుల్( Rahul gandhi ), ప్రియాంక,సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ కు అభినందనలు తెలిపారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, అమిత్ షా తమ స్థాయికి దిగజారి గల్లిగల్లి తిరిగి అబద్ధపు ప్రచారాలు చేసినప్పటికీ,విజ్ఞులైన కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారని అన్నారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టిలబ్ధి పొందాలని చూసిన బీజేపీకి కర్ణాటక ఓటర్ల తీర్పు చెంపపెట్టని అన్నారు.రాహుల్,ఖర్గే,ప్రియాంక రేవంత్ రెడ్డి( Revanth Reddy )ల నాయకత్వంలో తెలంగాణ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించడం ఖాయమన్నారు.2024 లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో సైతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మోడీ,అమిత్ షా ల మతపరమైన విద్వేష రాజకీయాలు ఇకపై దేశంలో చెల్లుబాటు కావని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube