రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా గొరంటాల మాజీ సర్పంచ్ కొమిరి శెట్టి విజయ తిరుపతి నీ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈ మేరకు నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను , నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి నీ హైదారాబాద్ లోని గాంధీ భవన్ లో,ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాంధీ బాపు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తనను గౌరవించి మార్కెట్ కమిటీ చైర్మన్ గా భాద్యతలు అప్పగించినందుకు ప్రత్యేకంగా నియోజక వర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి కి కోమిరి శెట్టి విజయ తిరుపతి దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్థికంగా సైతం అభివృద్ధి చెందిన విజయ తిరుపతి కి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడంతో మండలంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం రానున్నది.
అసెంబ్లీ ఎన్నికల కు ముందే కాంగ్రెస్ లోకి వెళ్ళిన తిరుపతి మొదట జెడ్ పి టి సి పదవి కి పోటీ చేస్తానని భావించగా గతంలోనే బిసి మహిళకు జేడ్ పీటీసీ రిజర్వేషన్ రాగ ఈ సారి మళ్ళీ అదే రిజర్వేషన్ వస్తుందో రాదోనని సందిగ్ధంలో ఉండగా నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ఇట్టి పదవి అప్పగించారు.