నల్లగొండ జిల్లా:మునుగోడు మండల కేంద్రంలో బీఎస్పీ నాయకులు ప్రభుత్వ పథకాలపై బుధవారం వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు దళితులమైన తమకు రాలేదని,అయ్యా నేను దళితుడినే కానీ,ఏ ఒక్క దళిత పథకానికి నోచుకోలేదు.
దళిత బంధు రాలేదు.మూడెకరాల భూమి రాలేదు.
మూడు లచ్చల రూపాలు రాలేదు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదు.
రాష్ట్ర ప్రభుత్వలో దళితులకు ఇచ్చిన హామీలు నెరవేదేన్నోడో?మునుగోడు గ్రామంలో దళిత బంధును వెంటనే అమలు చేయాలి.మాకు ఇల్లు లేదు నిరుపయోగంగా ఉన్న కోటి రూపాలు వ్యయంతో నిర్మించిన శాసన సభ్యుల వసతి గృహం మాకు ఇవ్వండి.
అంటూ ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ రోడ్డు పక్కన నిలబడి నిరసన తెలిపారు.