నల్లగొండ జిల్లా:ఇందిరమ్మ ఇళ్ల( Indiramma House Scheme ) నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) గుడ్ న్యూస్ చెప్పింది.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తొలిదశలో సొంత స్థలం( Own place ) ఉన్నవారికి ఆర్థిక సాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతోపాటు ఆర్థిక సాయం అందజేయనుందని సమాచారం.తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనుంది.ఇంటినిర్మాణానికి రూ.5 లక్షలను మూడు విడతల్లో జమ చేయనుంది.