ఎండిపోతున్న వరి పంటలు ట్యాంకర్ తో నీళ్ళు పోస్తున్న రైతులు

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన రైతు తాను సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకున్న తరుణంలో పంటకి అవసరమైన నీరు లేకపోవడంతో చూస్తూ ఊరుకోలేక వాటర్ ట్యాంకర్ సహాయంతో వరి పంటకు నీరందిస్తూ పంటను కాపాడెందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు.భూగర్భ జలాలు తగ్గిపోవడంతో మొన్నటి వరకు పుష్కలంగా నీరు పోసిన వ్యవసాయ బోర్లు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే భరించలేక కష్టాలు పడుతున్నారు.

 Farmers Watering The Drying Paddy Crops With A Tanker , Lakshmidevigudem, Farme-TeluguStop.com

ఒకపక్క విద్యుత్ కోతలు మరో పక్క భూగర్భ జలాలు అడుగంటడంతో తీరా చేతికొచ్చిన పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.ప్రభుత్వ పెద్దలు,అధికారులు తక్షణమే స్పందించి నాగార్జునసాగర్ ఎడమ కాలువకు పది రోజులు నీటిని విడుదల చేసి చేతికొచ్చిన పంట పొలాలను కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube