నల్గొండ జిల్లా:జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో పాటు ఉరుములు,మెరుపులు,ఈదురుగాలులు కూడా తోడయ్యాయి.దీనితో నకిరేకల్ మండలం చౌళ్ళగూడెం స్టేజీ వద్ద ఓగోడు రోడ్డుకు సమీపంలో తాటిచెట్టుపై పిడుగు పడటం వల్ల చెట్టుపై మంటలు చెలరేగాయి.
ఆ సమయంలో అక్కడా ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.మరో మూడు నాలుగు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.