రాజన్న సిరిసిల్ల జిల్లా :స్వయం సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు.స్వయం సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు యంత్రాలపై విస్తారాకులు, పేపర్ ప్లేట్స్, చట్నీలు, వక్కపొడి, లెదర్ బ్యాగ్స్, స్వీట్స్, సమోసాలు, పిండి వంటలు, మగ్గం వర్క్స్ ఇతర సామాగ్రి తయారు చేసి, విక్రయిస్తున్నారు.
వీరందరితో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా వస్తువులు తయారు చేసే వారితో మాట్లాడారు.
వస్తువుల తయారీ, దానికి అయ్యే ఖర్చు, ఎంత మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.ఇక్కడ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్, మెప్మాా డీఎంసీ రాజేశం తదితరులు పాల్గొన్నారు.