వంగిన విద్యుత్ స్తంభం...తృటిలో తప్పిన ప్రాణాపాయం.

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాఖీ పౌర్ణమి పండగ పూట పెద్ద విద్యుత్ ప్రమాదం తప్పింది.వివరాలిలా ఉన్నాయి.

 A Bent Power Pole Is A Narrowly Missed Fatality , Missed Fatality, Raj Kumar ,-TeluguStop.com

ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 9వ వార్డులో గల ఆడేపు రాజ్ కుమార్ ఇంటి వద్ద విద్యుత్ స్తంభం ఉంది.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు,గాలికి విద్యుత్ స్తంభం వంగడం ప్రారంభం అయింది.

సోమవారం ఉదయం రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు తెల్లవారి లేచి చూసేసరికి విద్యుత్ స్తంభం కింద పడిపోయే స్థితిలో ఉండగా దానికి సపోర్ట్ గా ఒక కర్రను ఉంచారు.ఇట్టి విషయాన్ని అక్కడ ఉన్న వార్డు ప్రజలు స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లగా వెంటనే సెస్ ఏ ఈ పృథ్వీధర్ కు తెలియజేయగా స్పందించిన ఏ ఈ క్షేత్ర స్థాయిలో విద్యుత్ స్తంభం పరిశీలించి సరి చేయాలని విద్యుత్ హెల్ప్ వెంకటేష్ ను ఆదేశించారు.

మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటు హెల్పర్ వెంకటేష్ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సెస్ ఏ ఈ కి మిషన్ సహాయంతో సరి చేయాలని వివరించారు.వెంటనే మిషన్ సహాయంతో సరి చేయాలని ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని సెస్ ఏ ఈ సెస్ సిబ్బందిని ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలో వంగి కింద పడిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభం ను సరి చేయాలని ఆదేశించిన సెస్ ఏ.ఈ పృథ్వీ ధర్ కు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు,సెస్ సిబ్బందికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య గారి తిరుపతి గౌడ్,ఆడేపు రాజ్ కుమార్ తో పాటు వార్డు ప్రజలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube