ఈ ఎన్నికల్లో టిడిపి మద్దతు కాంగ్రెస్ కే:వస్కుల కృష్ణయ్య

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) టీడీపీ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని,నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి ( Kunduru Raghuveer Reddy )గెలుపు కోసం టిడిపి కార్యకర్తలు పనిచేస్తారని దేవరకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వస్కుల కృష్ణయ్య తెలిపారు.బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి నేనావత్ బాలూ నాయక్ కు మద్దతు ప్రకటించి,ఆయన గెలుపు కోసం టిడిపి పనిచేసిందని గుర్తు చేశారు.

 Tdp's Support In This Election Is Congress , Vaskula Krishnaiah , Kunduru Ragh-TeluguStop.com

అదే విధంగా ప్రస్తుతం నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం టిడిపి కార్యకర్తలు కృషి చేస్తారని,కుందూరు రఘు వీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో తెలుగుదేశం పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు కోతి అమరేందర్ రెడ్డి,చందంపేట మండల అధ్యక్షుడు చిలుకూరు బ్రహ్మచారి,పీఏపల్లి మండల అధ్యక్షుడు సీతారాములు, చింతపల్లి మండల ఉపాధ్యక్షుడు సంతోష్,మాజీ సర్పంచ్ నరసింహ,క్రికెట్ యాదగిరి,పెద్దయ్య, టిఎన్ఎస్ఎఫ్ నల్గొండ పార్లమెంట్ అధ్యక్షుడు వస్కుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube