Viral Video : వైరల్ వీడియో: రెస్టారెంట్లో దోశ ఆర్డర్ ఇచ్చిన మహిళ.. వచ్చిన దోశను తెరిచి చూడగా..!

దేశ రాజధాని ఢిల్లీ( Delhi ) నగరంలో ఓ మహిళ తన స్నేహితురాళ్లతో కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్ళింది.అక్కడ తాను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ దోశను ఆర్డర్ చేసింది.

 Viral Video The Woman Who Ordered Dosha In The Restaurant Opened The Dosha And-TeluguStop.com

ఆ దోశను రెస్టారెంట్ వారు తనకు ఇచ్చిన తర్వాత ఓ రెండు ముక్కలు తినింది.అయితే ఆ సమయంలో ఆమెకు కాస్త ఏదో తేడా అనిపించడంతో ఆ దోశను క్షుణ్ణంగా పరిశీలించింది.

ఆ దోశను చూసిన ఆవిడ నిజంగా వామిటింగ్ చేసుకునేలా పరిస్థితి ఏర్పడింది.అసలు విషయం ఏమిటంటే.

ఆమె తీసుకున్న దోశలు( Dosalu ) ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి.ఈ దెబ్బకి ఆవిడ ఆ రెస్టారెంట్ యాజమాన్యంపై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.దోశ తీసుకున్న తర్వాత ఆవిడ బొద్దింకలను గమనించాక ఆ రెస్టారెంట్ యాజమాన్యంపై గొడవకు దిగింది.అంతటితో ఆగకుండా ఆ రెస్టారెంట్ పై పోలీస్ లకు కంప్లైంట్ చేసింది.వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్ దగ్గరికి చేరుకొని రెస్టారెంట్ సంబంధించిన పర్మిషన్ ను చూపించమనగా యాజమాన్యం తమకి ఎటువంటి అనుమతులు లేవని చెప్పగా.

అసలు ఇంత రద్ది ప్రాంతంలో ఇంత రెస్టారెంట్ కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఆమె షాక్ గురైంది.

ఏది ఏమైనా ఆ హోటల్ పై సదరు అధికారులు యాక్షన్ తీసుకునేంతవరకు తాను ఈ విషయాన్ని వదలనని చెప్పుకొచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఆమెపై పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.

ఆ రెస్టారెంట్ కిచెన్ కు పై భాగం కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube