నూతన కార్మిక చట్టాల ఆలోచనను కేంద్రం విరమించుకోవాలి: సిఐటియూ

సూర్యాపేట జిల్లా: ఈనెల 16న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియూ సూర్యాపేట జిల్లా నాయకులు కందగట్ల అనంత ప్రకాష్,మాజీ జడ్పీటిసి ముషం నరసింహ పిలుపునిచ్చారు.మంగళవారం మేళ్ళచెరువు మండలంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో సమ్మెకు సంబంధించిన నోటీసును సీనియర్ జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావుకి అందజేశారు.

 Center Should Drop Idea Of ​​new Labor Laws Citu, Central Government, ​�-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన కార్మిక చట్టాలను తేవాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

కార్మిక హక్కులను కాలరాసే విధానాలను విడనాడాలని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ,కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరిగే సమ్మెలో కార్మికులు, రైతులు,స్కీం వర్కర్లు, ఆశాలు,అంగన్వాడీలు, విఏఓలు,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నన్నెపంగ రమేష్, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube