చలివేంద్రాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని 25వ వార్డు ముత్యాలమ్మ గుడి సమీపంలో సూర్యాపేట పురపాలక సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని మంగళవారం స్థానిక కౌన్సిలర్ ఆకుల కవితతో కలిసి సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో రానున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట పట్టణ ప్రజల దాహాన్ని తీర్చుటకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది చౌరస్తాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

 The Municipal Chair Person Inaugurated Chalivendram ,mutyalamma Temple ,chaliven-TeluguStop.com

సూర్యాపేట పట్టణ ప్రజలు ఈ కేంద్రాలను ఉపయోగించుకొని ఎండలకు ఇబ్బంది పడకుండా తమ యొక్క దాహాన్ని తీర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల లవకుశ,జానకి రాములు, పిడమర్తి మధు,ఎర్ర వెంకన్న,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,మెప్మా పీడీ అధికారి రమేష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులు,వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube