సినిమా ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీలకు కార్ల పిచ్చి ఉన్న విషయం తెలిసిందే.మార్కెట్లోకి ఎలాంటి కారు విడుదల అయినా సరే వెంటనే ఆ కారణం కొనుగోలు చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా టాలీవుడ్ వాళ్లతో పోల్చుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఎక్కువ ఖరీదు చేసే కార్లను కొనుగోలు చేయడంతో పాటు ఎక్కువ కార్లను వారే వినియోగిస్తూ ఉంటారు.ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రిన, శ్రద్ధా కపూర్ వంటి స్టార్లు ఖరీదైన హైఎండ్ కార్లలో షికార్ చేయడం తెలిసినదే.
ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న వారి సరసన చేరి పోయింది.రష్మిక మందన దాదాపుగా రెండు కోట్ల విలువ చేసే అద్భుతమైన మెర్సిడిస్ బెంజ్ ఎస్ 450 కారును ( Mercedes-Benz S450 car )కొనుగోలు చేసింది.

కాగా సెలబ్రిటీలు తమ రోల్స్ రాయిస్లు, లంబోర్గినిలు ( Rolls-Royces, Lamborghinis )మేబ్యాక్ వంటి ఖరీదైన వెర్షన్ లతో మెరుపులు మెరిపిస్తుంటే, రష్మిక కూడా తన యూనిక్ టేస్ట్ ని ప్రెజెంట్ చేస్తోంది.వెటరన్స్ ఖరీదైన హ్యాబిట్స్ తోను పోటీపడటంలో రష్మిక ఎక్కడా తగ్గడం లేదు.తనవద్ద ఇప్పటికే ఐదు ఖరీదైన లగ్జరీ బ్రాండ్ కార్లు గ్యారేజీలో ఉన్నాయి.కేవలం ఈ కార్ల కోసం కోట్లాది రూపాయలను రష్మిక వెచ్చిస్తోంది.అయితే తాజాగా ఆమె కొనుగోలు చేసిన కారు ఖరీదు తెలిసి అభిమానులు నేటిజన్స్ షాక్ అవుతున్నారు.

ఇకపోతే రష్మిక విషయానికి.ప్రస్తుతం ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.టాలీవుడ్ బాలీవుడ్ అని సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇకపోతే ప్రస్తుతం రష్మిక చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.కాగా రష్మిక మందన్న నటించిన సికందర్ ఈద్ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.
వీటితోపాటు మరికొన్ని సినిమాలు ఇంకా షూటింగ్ దశలో ఉన్నాయి.