పూర్వం రోజులలో చాలామంది పేదవారు మిల్లెట్ ను ( Millet ) సాధారణంగా ఆహారం కోసం ఉపయోగించేవారు.ఆ సమయంలో ధనికులు మిల్లెట్ ను ఆహారంలో ఉపయోగించేవారు కాదు.
తక్కువ ధరకు లభించే వస్తువులు కావడంతో నిరుపేదలు దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో ఉపయోగించేవారు.ఈ విధంగా సామాన్యులు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించేవారు.
కాలక్రమమైన శాస్త్రవేత్తలు రాగుల లక్షణాలను అధ్యయనం చేశారు.ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా సూపర్ ఫుడ్ గా మారిపోయింది.
ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని మిల్లెట్ ను ఇయర్ గా ప్రకటించింది.ఈ రాగిలో ( Finger Millet ) మానవ పోషకాలకు అవసరమైన అన్ని పోషకాలు ఉన్నాయి.
మిల్లెట్ అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ను కలిగి ఉంటుంది.
దీనితో పాటు ఇందులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.ఇవి క్యాన్సర్( Cancer ) నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.గుండె జబ్బుల నుంచి మధుమేహం వరకు అన్నిటినీ దూరం చేసుకోవడానికి మిల్లెట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
రాగులలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.దీంతో క్యాన్సర్, గుండెపోటు,మధుమేహం లాంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
రాగులలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ముఖ్యంగా కడుపు క్యాన్సర్ ను ఇవి నివారిస్తాయి.
అలాగే రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్( Anti Oxidants ) ఎలిమెంట్స్ కణాల నుంచి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి.క్యాన్సర్ కణాల పెరుగుదలను కష్టతరం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆరోగ్య అధ్యయనాల ప్రకారం రాగులలో ఫైబర్ కంటెంట్ కడుపులో జిగట పదార్థంగా మారుతుంది.
ఇది కొవ్వును త్వరగా తగ్గిస్తుంది.అలాగే రాగి జావాను తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఏ, బి, సి విటమిన్లు మినరల్స్ మనకు కావాల్సిన శక్తిని అందజేస్తాయి.దీంతో జీర్ణ శక్తి పెరుగుతుంది.
రాగుల వల్ల కాలయంలోని అదనపు కొవ్వు తక్కువ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది ఎముకలను బలంగా మారుస్తుంది.
రాగులను రోజు తినేవారిలో ఎముకలు దృఢంగా మారుతాయి.