చేతులు మృదువుగా, అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మానిక్యూర్ ఎంతో అవసరం.అందుకే చాలా మంది అమ్మాయిలు మానిక్యూర్ చేయించుకునేందుకు తరచూ బ్యూటీ పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
అయితే ఎటు వంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా మానిక్యూర్ చేసుకోవచ్చు.మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా చేతి గోళ్లకు ఉన్న నెయిల్ పెయింట్ను రిమూవర్తో పూర్తిగా తొలగించి.గోళ్లను మీకు నచ్చిన ఆకృతిలో కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక గిన్నెలో సోప్ వాటర్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఒక టేబుల్ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి మిక్స్ చేయాలి.ఇందులో చేతి వేళ్లను ముంచి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచితే.
గోళ్లకు పట్టి ఉన్న మురికి, మలినాలు తొలగి పోతాయి.
ఇప్పుడు క్యూటికల్ రిమూవర్తో గోళ్ల చుట్టూ ఏమైనా క్యూటికల్ బిట్స్ ఉంటే తీయాలి.తద్వారా గోళ్లు అందంగా, పెద్దగా కనిపిస్తాయి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కాఫీ పౌడర్, ఒక స్పూన్ షుగర్ పౌడర్, ఒక స్పూన్ బియ్యం పిండి, ఐదు స్పూన్ల కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
గోరు వెచ్చని నీటితో అర చేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా క్లీన్ చేసుకుని.తయారు చేసుకున్న మిశ్రమంతో స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలి.
స్క్రబ్బింగ్ అనంతరం చల్లటి నీటితో చేతులను కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి.ఇప్పుడు మంచి మాయిశ్చరైజర్ చేతులకు వేళ్లకు అప్లై చేసి మర్థన చేసుకోవాలి.
ఆపై గోళ్లకు మంచి నెయిల్ పెయింట్ వేసుకుంటే మానిక్యూర్ పూర్తి అయినట్టే.ఇలా రెండు వారాలకు ఒక సారి చేస్తే గనుక చేతులు మృదువుగా, కోమలంగా, అందంగా మెరిసిపోతాయి.