ఆర్టీజన్ లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి:ముస్త్యాల కిషన్

సూర్యాపేట జిల్లా:విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ ఎస్పీడీసీఎల్ గౌరవాధ్యక్షులు ముస్త్యాల కిషన్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం నుంచి తెలంగాణ బహుజన విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.

 Artisans Should Be Recognized As Regular Employees: Mustyala Kishan-TeluguStop.com

ప్రవీణ్ కుమార్ కి వినతిపత్రం ఇవ్వడం కోసం బయలుదేరుతూ మాట్లాడారు.విద్యుత్ సంస్థలో 23000 వేల మంది ఆర్టిజన్ లు ఉన్నారని,వారిని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనులు మాత్రం చేయించుకుంటూ వేతనం విషయంలో తక్కువచేసి చూస్తున్నారని ఆరోపించారు.

వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, సమానం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇటీవల కాలంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుందని,అనేక మంది ఆర్టిజన్లు పనిచేస్తున్న సంస్థలో గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకనైనా ప్రభుత్వం ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పరిదల ప్రసాద్,నరేందర్,వాల్ సింగ్,సతీష్,రవి, మధుసూదన్,అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube