టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Star hero Prabhas )గురించి మనందరికీ తెలిసిందే.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోలెడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.ఇందులో మొదట రాజాసాబ్ సినిమా విడుదల కానుంది.

మారుతి( Maruti ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.అలాగే ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు మొదట్లో వార్తలు వినిపించాయి.కానీ ఏప్రిల్ నెల కూడా పూర్తి కావస్తోంది.ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాలతో పాటు హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ప్రభాస్ కెరిర్ గురించి పక్కన పెడితే తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జరీనా వహాబ్.జరీనా వహాబ్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించనున్నారు.కాగా ఈ మధ్య ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
ప్రభాస్ ను ప్రశంసలతో ముంచెత్తారు.ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, సెట్ లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని ఆమె అన్నారు.
అదేవిధంగా వచ్చే జన్మలో నాకు ఇద్దరు కొడుకులు కావాలి వారిలో ఒకరు సూరజ్ అయితే మరొకరు ప్రభాస్ అయి ఉండాలి అంటూ ఆమె మనసులో మాట బయట పెట్టారు.ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.