సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి తెలంగాణ ఉద్యమ నాయకుడు,తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు హాజరై మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్చంద సేవా కార్యక్రమాలను అభినందించారు.
కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను,వారి సేవలను పేద పిల్లలు వినియోగించుకోవాలని, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ను ఉపయోగించుకొని పదవ తరగతిలో రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కొలికపంగు వాసు,కస్తూరీ ఫౌండేషన్ సభ్యులు మహేష్, రామకృష్ణ,విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.