మిర్యాలగూడలో విఓఏల మెరుపు ధర్నా...

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ ( Miryalaguda )పరిధిలోని మాడుగులపల్లి టోల్గేట్ వద్ద సోమవారం విఓఏలు మెరుపు ధర్నాకు దిగడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

 Voas Dharna In Miryalaguda , Voas Dharna , Miryalaguda , Julakanti Ranga Reddy ,-TeluguStop.com

వివోఏలతో( VOAs ) ధర్నాకు సీపీఎం నేత,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి( Julakanti Ranga Reddy ) మద్దతు ప్రకటించారు.

గత 44 రోజులుగా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న వివోఏలు సోమవారం హైదరాబాదు లోని ఇందిరా పార్కు వద్ద రాష్ట్రస్థాయి సమావేశం మరియు ధర్నాకు వెళ్తున్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో మెరుపు ధర్నా,రాస్తారోకో చేపట్టారు.మిర్యాలగూడ డివిజన్ కి చెందిన వివోఏలను పోలీసులు మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద అడ్డగించడంతో ధర్నాకు దిగినట్లు తెలిసింది.

ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు నిరసన విరమింప చేసేందుకు పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube