నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పడిన మండలం తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రం నుండి అనుముల మండలం (హాలియా) వరకు 4 కి.మీ.
,అలాగే నాగార్జునసాగర్ వయా డొక్కాలబావి తండా నుండి దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు సింగల్ రోడ్దే ఉంది.మండల వ్యాప్తంగా వివిధ అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి రావడానికి,మండల కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కేవలం సింగిల్ రోడ్డు మాత్రమే ఉండడం, రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరగడంతో ప్రయాణికులు,వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
మండల ఏర్పాటైన నాటి నుండి, మండల కేంద్రానికి వాహన రాకపోకలు అధికమై సింగిల్ రోడ్డు నిత్యం రద్దీగా మారింది.ఎదురుగా చిన్న వాహనం వచ్చినా ఒక వాహనం రోడ్డు దిగవలసిన పరిస్థితి వస్తుంది.
దీనితో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.గత ప్రభుత్వం మండల కేంద్రం నుంచి మరొక మండల కేంద్రానికి డబులు రోడ్డు నిర్మాణం తప్పనిసరిగా నిర్మిస్తామని హామీ ఇచ్చి,పదేళ్లపాటు కాలయాపన చేశారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దామరచర్లలోని వీర్లపాలెం దగ్గర ఏర్పాటు చేస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ కి హైదరాబాద్ నుండి రావాలంటే తిరుమలగిరి నుండి చాలా దగ్గరగా ఉంటుంది.ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సింగిల్ రోడ్డున డబుల్ రోడ్డుగా మార్చి ఈ ప్రాంత ప్రజల కలను సాకారం చేయాలని కోరుతున్నారు
.