హైదరాబాద్/నల్లగొండ:మునుగోడులో పలుమార్లు నా కాన్వాయ్పై దాడికి యత్నించారు.పలివెలలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు.
కేంద్రమంత్రిని అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని హుజూరబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పలివెలలో ప్రచారం చేస్తున్న నా సతీమణిని దూషించారని,బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వి,జెండా కర్రలతో కొట్టారని,నా గన్ మెన్లు లేకపోతే నా తలకు తీవ్ర గాయాలు అయ్యేవని అన్నారు.
నా పీఆర్వో,గన్మెన్లకు గాయాలయ్యాయని,టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి డీఎస్పీని కొట్టారని,అయినా పోలీసు వ్యవస్థకు కనిపించదని అన్నారు.నాపై ఈగ వాలినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు.