నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణలో ఒక్కరోజు బంద్ పాటించాలని డ్రైవర్ల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో,క్యాబ్,లారీ సర్వీసులు నిలిచిపోనున్నాయి.
ఫిట్నెస్ పత్రాల ఆలస్యానికి రవాణాశాఖ జరిమానా విధించడంపై డ్రైవర్లు,ఓనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రేపు ట్రాన్స్పోర్టు భవన్ ముట్టడికి డ్రైవర్ల ఐకాస పిలుపునిచ్చింది.కొత్త మోటారు వాహనాల చట్టం కింద ఆలస్యంపై రోజుకు రూ.50 చొప్పున విధిస్తున్న జరిమానాను రద్దు చేయాలని ఐకాస నేతలు డిమాండ్ చేస్తున్నారు.