నల్లగొండ జిల్లా:తెలంగాణ ఉద్యమ సమయంలో మొట్టమొదటి పిడీ యాక్ట్ శిక్ష అనుభవించిన ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.కేసీఆర్ తో విభేదించి తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించిన చెరుకు సుధాకర్,మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రేస్ లో విలీనం చేసి,రేపు ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్న సమాచారం.
ఉదయం అధిష్టానం నుండి ఫోన్ రావడంతో చెరుకు సుధాకర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతుంది.కాంగ్రేస్ లో పార్టీలో చేర్చుకొని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.