నల్లగొండ జిల్లా:నల్లగొండ బహిరంగ సభకు వస్తున్న కేటీఆర్,హరీష్ రావు( KTR, Harish Rao ),ఇతర నాయకులకు చేదు అనుభవం ఎదురైంది.వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఒక్కసారిగా ఎన్.
ఎస్.యూ.ఐ.కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు.
నల్ల చొక్కాలు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.పోలీసులు వారిని అదుపు చేయడంతో పరిస్థితి కంట్రోల్ కి వచ్చింది.
మూడు రోజుల క్రితమే కేసీఆర్( KCR ) సభను అడ్డుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy )హెచ్చరించి,కేసీఆర్ నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే సభలో ప్రసంగించాలని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.