ఉదయం రోగులకు మందు గోళీలు రాత్రి మందు బాబులకు సిట్టింగ్

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం గొండ్రియాలలోని పల్లె దవాఖాన మందు బాబులకు అడ్డగా మారింది.రాత్రివేళ కొందరు ఆకతాయిలు మద్యం సేవించి కాళీ సీసాలను కూడా అక్కడే పడేస్తున్నారు.

 Palle Dawakhana Sitting For Patients In The Morning And Sitting For Drunkers At-TeluguStop.com

అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.పల్లె దవాఖానలో డాక్టర్ లేక, ఏఎన్ఎం విధులకు రాక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని,

ఉదయం 11 గంటల సమయంలో పల్లె దవాఖాన మెట్ల వద్ద తాగిపడేసిన బీరు సీసాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే మందు బాబులకు పల్లె దావాఖాన అడ్డగా మారిందని వాపోయారు.ఈ విషయంపై వైద్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube