లాక్ డౌన్ మళ్లీ పొడగించారాని ఓ మహిళ ఏకంగా...

ప్రస్తుత కాలంలో కొందరు తీసుకునే నిర్ణయాలు తమ కుటుంబాలను తీవ్ర విషాదం పాలు చేస్తున్నాయి.తాజాగా ఓ మహిళ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ మళ్లీ పొడిగించడంతో కుటుంబం గడవదనే భయంతో ఏకంగా ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Married Women Commit Suicide For Lockdown Extended Reason Married Women, Suicid-TeluguStop.com

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు దంపతులు తమకు పిల్లాపాపలతో నివాసం ఉంటున్నారు.అయితే ఇందులో వివాహిత భర్త కుటుంబాన్ని పోషించడం కోసం స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

అయితే దాదాపు గత రెండు నెలలుగా పనులు లేక ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.దీంతో ఇల్లు గడవక తనలో తానే మదన పడుతున్నాడు.అయితే అప్పుడప్పుడు ఈ విషయం గురించి తన భార్యతో చెబుతూ ఉండేవాడు.దీనికి తోడు గతంలో కుటుంబ ఖర్చులు నిమిత్తం చేసినటువంటి అప్పుల వడ్డీలు పెరుగుతుండడంతో భార్య,భర్తలిద్దరూ ఈ విషయం గురించి బాధ పడుతూ ఉండేవారు.

ఆ సమయంలో వివాహిత  విచక్షణ కోల్పోయి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అప్పటికే ఒంటి నిండా బలంగా గాయాలు అవడంతో మరణించింది.

ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కలచివేసింది.అలాగే గతంలో కూడా కొన్నిచోట్ల లాక్ డౌన్  కారణంగా పనులు నిలిచి పోవడంతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు.కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి లాక్ డౌన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube